అమరావతి:బెంజ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ హోమ్,విపత్తుల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత ని అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ )జాతీయ ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అభినందనలు తెలిపారు.వెలగపూడి లోని ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలో రెండో బ్లాక్ లో పదవి బాధ్యతలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హోం శాఖ విపత్తుల శాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత ని మర్యాదపూర్వకంగా కలిసి మంత్రి చాంబర్లో శాలువాతో సన్మానించి పూల బొకేని అందజేశారు. ఈ కార్యక్రమంలో జె అమర్ శేషేంద్ర తదితరులు పాల్గొన్నారు.