జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారించడం ప్రత్యేక డ్రైవ్
June 02, 2025
అమరావతి
పల్నాడు జిల్లా కలెక్టర్ సూచనలతో జిల్లా రోడ్డు భద్రత కమిటీలో సూచనలు సలహాలు చేపట్టారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు గతంలో కన్నా అధికంగా జరుగుతున్న కారణంగా వాటిని నివారించడానికి జిల్లా కలెక్టర్ రవాణా శాఖ, పోలీస్ శాఖ ఏపీఎస్ఆర్టీసీ వారిని జాయింట్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించమని సిఐ అచ్చయ్య తెలిపారు.ఈ ఆదేశాల మేరకు తేది.31-05-2025 సాయంత్రం 4 గంటలకు పోలీసు, రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులు సంయుక్తంగా అమరావతి లోని ఆర్.టి.సి బస్ స్టాండ్ కూడలి లో తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలలో భాగంగా పరిమితికి మించి ప్రయాణం చేస్తున్న వాహనములపై కేసులు నమోదు చేయడం జరిగినది. ఈ తనిఖీలలో ఆటో రిక్షాలు, సరుకు రవాణా వాహనములపై తనిఖీలు నిర్వహించినాము. ఇందులో భాగంగా సుమారు 80 వాహనములు తనిఖీచేసి 36 వాహనములకు కేసులు నమోదు చేసినాము. అందులో 5 వాహనములు స్వాధీనము చేసుకుని భద్రత నిమిత్తము అమరావతి పోలీసు స్టేషన్ ఆవరణం కు తరలించామన్నారు. అపరాధ రుసుము రూపంగా 80,600/- రూపాయలు వసూలు చేసామన్నారు.
ఈ తనిఖీలలో అమరావతి ఆర్టీసీ డి ఎం , పోలీస్ శాఖ వారు తరఫు నుంచి సీ.ఐ వై.అచ్చయ్య, ఎస్.ఐ కె.అమీర్, రవాణా శాఖ వారి తరఫునుంచి సహాయ తనిఖీ అధికారి ఎం.సురేష్ బాబు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని దీనివల్ల రోడ్లపై జరిగే ప్రమాదాలను నిర్మూలించవచ్చని తెలిపారు.