ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా గోపు శ్రీనివాసరావు నియమితులయ్యారు

 


ఈ మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు సాంబశివ నాయుడు నియామక ఉత్తర్వులను జారీ చేశారు. 


ఏపీఈఆర్ యు  యూనియన్  కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడంతో పాటు జర్నలిస్టు సమస్యలపై ఇప్పటివరకు యూనియన్ చేపట్టిన ప్రతి పోరాటంలో చురుకైన పాత్ర పోషించిన గోపు శ్రీనివాసరావు సేవలను, అంకిత భావాన్ని గుర్తించిన యూనియన్ రాష్ట్ర కార్యవర్గం ఈ నియామకం చేపట్టింది.


డెల్టా టుడే పత్రికలో గత 6 సం.లుగా స్టేట్ బ్యూరోగా పనిచేస్తున్న గోపు శ్రీనివాసరావు, గతంలో ఆంధ్రభూమిలో కూడా రిపోర్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 


తనకు బాపట్ల జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు సాంబశివ నాయుడుకు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలినేడి హరిబాబుకు గోపు శ్రీనివాసరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 


ఈ సందర్భంగా డెల్టా టుడే పత్రిక జర్నలిస్టులు,  బాపట్ల జిల్లా మీడియా మిత్రులు గోపు శ్రీనివాసరావుకు అభినందనలు తెలియజేశారు.