జూన్ 04 - వెన్నుపోటు దినం" గా పాటిద్దాం! ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వాన్ని నిలదీద్దాం

పెదకూరపాడు బెజవాడ వార్త నియోజకవర్గ పరిధిలోని క్రోసూరు "నాలుగు రోడ్ల కూడలి" వద్ద ఉదయం 10 గంటలకు జరిగే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పిలుపునిచ్చారు. మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కి, ప్రకటించిన పధకాలను అటకెక్కించి, ప్రజలకు "వెన్నుపోటు" పొడిచిన ప్రభుత్వ విదానానికి నిరసన వ్యక్తం చేద్దాం అన్నారు. ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలతో ప్రజల్ని మభ్యపెట్టి, గెలిచిన తర్వాత పధకాలను అమలు చేయకుండా ప్రజల్ని "వెన్నుపోటు" పొడిచిన చంద్రబాబు ప్రభుత్వ మోసపూరిత విధానానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ, ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, నియోజకవర్గ కేంద్రాల్లో "నిరసన కార్యక్రమాలు" చేపట్టాలని మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు "జూన్ 04 న - వెన్నుపోటు దినం" కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద జూన్ 04 బుదవారం నాడు ఉదయం 10 గంటలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళి అర్పించి, అనంతరం క్రోసూరు తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేస్తామన్నారు. పెదకూరపాడు నియోజకవర్గానికి చెందిన వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు , ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పిలుపునిచ్చారు.