బెంజ్ న్యూస్ : పల్నాడు బ్యూరో
January 27, 2025
బహుముఖ ప్రజ్ఞాశాలి పోసిపోగు ఇర్మియ పార్థివ దేహానికి నివాళులర్పించిన బెంజ్ న్యూస్ పల్నాడు బ్యూరో ఇంచార్జ్ బంకా కిషోర్ బాబు
మరియు
జాషువా ఫౌండేషన్ సభ్యులు
బెంజ్ న్యూస్ : పల్నాడు బ్యూరో
సత్తెనపల్లి జాషువా సేవా సమితి అధ్యక్షులు,పల్నాడు జిల్లా సిపిఐ సత్తెనపల్లి నియోజకవర్గ కార్యదర్శి, ఆనంద్ ఎడ్యుకేషనల్ అకాడమీ డైరెక్టర్, పాత్రికేయులు, బహుముఖ ప్రజ్ఞాశాలి పోసి పోగు ఇర్మియా మాస్టారు రాత్రి రెండు గంటలు సమయంలో గుండెపోటుతో మరణించారు. బెంజ్ న్యూస్ పల్నాడు జిల్లా బ్యూరో ఇన్చార్జి బంకా కిషోర్ బాబు, సత్తెనపల్లి నియోజకవర్గం క్రోసూరు మండలం లోని దొడ్లేరు గ్రామము నందు పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఈ అంతిమయాత్రలో సత్తెనపల్లి జాషువా ఫౌండేషన్ సభ్యులు ,గుజ్జర్లపూడి సురేష్, జాషువా ఫౌండేషన్ సభ్యులు గుజ్జర్లపూడి జాన్ బాబు, గుజ్జర్లపూడి రాజు, బుల్లా రామారావు,గుజ్జర్లపూడి రవి రాజు, కోటేశ్వరరావు,గుజ్జర్లపూడి స్వాన్లీ,తదితరులు పాల్గొన్నారు.