అధికారం కోసమే అమలు సాధ్యం కానీ హామీలు.
January 31, 2025
మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు
ఎన్నికల హామీలను తూచా తప్పకుండా నెరవేర్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ది అని, కరోనా కష్టకాలంలోనూ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరమైన పరిస్థితి లోనూ ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని పెదకూరపాడు మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు గారు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అమలు సాధ్యంగానే హామీలను ప్రజలకు ఇచ్చి అధికారులకు వచ్చారని ఇది ఒకరకంగా ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు సాధ్యం కాదని రాష్ట్ర బడ్జెట్ దీనికి సరిపోదని ఆనాడే జగన్మోహన్ రెడ్డి గు ప్రజలకు చెప్పి తన నిజాయితీని, చిత్తశుద్ధిని నిరూపించు కున్నారని కానీ చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు చేస్తామంటూ ప్రజలకు మాట ఇచ్చి అధికారులకు వచ్చి ఇప్పుడు ఆ మాట నెరవేర్చలేక పోతున్నామని ప్రకటనలు చేయడం దురదృష్టకరమని, ఇది ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఆర్థిక స్థితి బాగాలేదని ఉచితాలిస్తే శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేసింది వారినని, సూపర్ సిక్స్ లంటూ అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టింది వారేనని ప్రజలు గమనిస్తున్నారని విషయం మర్చిపోయా ప్రవర్తిస్తే ప్రజా అగ్రహానికి గురికాక తప్పదన్నారు. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రజలకి సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడే జిఎస్టి వసూలు లో గాని, జిడిపి వృద్ధిరేట్లో గాని రాష్ట్రం మెరుగైన స్థితిలో ఉందని, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి రెండిట్లోనూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారని గుర్తు చేశారు