పెదమద్దూరు (అమరావతి ) తేది 24-01-25 గౌరవపాత్రికేయులకు నమస్కారం సార్
January 24, 2025
పెదమద్దూరు (అమరావతి ) తేది 24-01-25
గౌరవపాత్రికేయులకు నమస్కారం సార్
పెదమద్దూరు లో ఘనంగా మాజీ మంత్రి పరిటాల రవి 20వ వర్ధంతి వేడుకలు
సీమ గడ్డపై బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు వారి అభ్యున్నతి కోసం కృషి చేసిన ధీరుడు పరిటాల రవీంద్ర
------ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు
జాతీయ ఉపాధ్యక్షులు, అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ )
ఈరోజు పెదమద్దూరు గ్రామంలో రాయలసీమ ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు పరిటాల రవీంద్ర 20వ వర్ధంతి వేడుకలు స్థానిక బస్టాండ్ సెంటర్లో ఉన్న పరిటాల విగ్రహం వద్ద జరిగాయి అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు పరిటాల రవి విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పూల తోటి నివాళులర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ రాయలసీమ గడ్డపై బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విశేష కృషి చేశారన్నారు అన్యాయాన్ని, భూస్వాములు పెత్తందారి వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు అన్నారు తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం ఉమ్మడి అనంతపురం జిల్లా లో ఎదురులేని మనిషిగా ఎదిగారు అన్నారు కార్యక్రమంలో అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ )జాతీయ ఉపాధ్యక్షులు మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పొదిలి శ్రీనివాసరావు, మాజీ అమరావతి పెద్ద మద్దూరు సాగునీటి సంఘం అధ్యక్షులు పొదిలి మదన్ మోహన్( బుజ్జి ), గ్రామపంచాయతీ సభ్యులు బుడ్డి హరిబాబు, బూత్ కన్వీనర్లు అనిల్ కుమార్,,పొదిలి నరసింహారావు, గ్రామ మాజీ ఉపసర్పంచ్ పొదిలి సాంబశివరావు, జాస్తి సుధాకర్, జాస్తి అప్పయ్య, జాస్తి అమరలింగేశ్వరరావు , గ్రామ పార్టీ నాయకులు, యడ్లపల్లి వెంకటేశ్వరరావు సాంబశివ అత్తోట జార్జి, నాయకులు పాల్గొన్నారు