పల్నాడు జిల్లా సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గం


  పెదకూరపాడుబెంజ్ న్యూస్

కోళ్లూరు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారు మరియు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు.. భక్తులు దాతలుగా మారాలి అప్పుడే హైందవ ధర్మాన్ని కాపాడిన వారి మౌతాం... మంత్రి ఆనం బెల్లంకొండ జూలై 21: భక్తులందరూ దాతలుగా మారాలని అప్పుడే మనమందరం హైందవ ధర్మాన్ని కాపాడిన వారిమవుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఆదివారం బెల్లంకొండ మండలం గంగిరెడ్డిపాలెం గ్రామ శివారు క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న కోళ్లూరు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాన్ని ఆయన మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ తో కలిసి దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తొలుత వారిని దేవాలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 40 కి పైగా స్వాములవార్ల మూలవిరాట్లు ఉన్నట్లు చెప్పారు. ఇక్కడ తాత్కాలికంగా ప్రతిష్టించిన ప్రసన్నాంజనేయ స్వామి భక్తుల కొంగుబంగారమై విరజిలుతున్నారని ఎక్కువమంది భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజలు చేస్తున్నారని వెల్లడించారు. ఈ ఆలయ నిర్మాణానికి ఐపీఎస్ అధికారి నాయక్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆలయ నిర్మాణ నిమిత్తం పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ సూచనల మేరకు రాజగోపుర నిర్మాణం తో పాటు ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు నూతన ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఇదే మూలవిరాట్ను ప్రతిష్టిస్తామని ఆలయ అర్చకులు పెద్దలు చెప్పటంతో మూల విరాట్ కు తన కుమారుడు ఆనం శుభకర్ రెడ్డి పేరుతో వెండి మకర తోరణం ఇస్తానని హామీ ఇచ్చారు తన కుమారుడు శుభకర్ రెడ్డి మొదటినుండి ఆంజనేయ స్వామి భక్తుడని తన పేరు మీదే వెండి మకర తోరణం ఇస్తానని చెప్పారు. ఈ ఆలయ నిర్మాణం ఒక దాత సహకారంతోనో ప్రభుత్వ సహకారంతోనో పూర్తవుతుంది అని అనుకోకుండా అందరూ తమ వంతు బాధ్యతగా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.