ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పి. ధాత్రి రెడ్డిని నియమించిన రాష్ట్ర ప్రభుత్వం...


 ప్రస్తుతం ఏలూరు SP గా బాధ్యతలు చేపట్టిన K.P.Sకిషోర్ IPS,  సతీమణి పి.ధాత్రి రెడ్డి,IAS  కావడం విశేషం....పాడేరు జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న ధాత్రి రెడ్డి ఏలూరు జిల్లాకి బదిలీ అయ్యారు.. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం గుండ్ల బావి గ్రామానికి చెందిన వారు ధాత్రి రెడ్డి.. 2019లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఐపీఎస్ శిక్షణ పొందుతున్న సమయంలో ఆమె మరోసారి సివిల్స్ రాసి జాతీయ స్థాయిలో 46వ ర్యాంక్ సాధించారు. దీంతో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. అంతకు ముందు డచ్ బ్యాంక్‌లో పని చేసిన ఆమె.. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విద్యను అభ్యసించారు.ఐపీఎస్ అధికారి అయిన  భర్త కొమ్మి ప్రతాప్ సైతం  ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకున్నారు.