బెంజ్ న్యూస్.విజయవాడలో ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది.
బ్యారేజీకి 11,459 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.
బ్యారేజీ 14 గేట్ల ద్వారా 10,150 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.
కాలువల ద్వారా మరో 1,309క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఏలూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది.
ప్రాజెక్టు స్పిల్ వే వద్ద నీటిమట్టం 31.7 మీటర్లకు చేరింది.
7,96,686 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.