తెలంగాణ రైతులు తస్మాత్ జాగ్రత్త

 


తెలంగాణ పోలీసుల విజ్ఞప్తి


పొంచి వున్న సైబర్ కేటుగాళ్ల ప్రమాదం


రాష్ట్రవ్యాప్తంగా రైతులకు లక్ష రూపాయల లోపు రుణమాఫీ ఆయన సందర్భంగా రైతులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. 


ఇదే అదునుగా భావించి సైబర్ కేటుగాళ్లు రైతుల అకౌంట్లను హ్యాక్ చేసే ప్రమాదం ఉందని ప్రతి రైతు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని తెలంగాణ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.


కాబట్టి మీకు ఏదైనా వాట్సప్ ద్వారా గుర్తు తెలియని మెసేజ్లు వచ్చిన, ఓటీపీలు వచ్చిన ఎవరితో పంచుకోకుండా ఉండగలరు.


ఏదైనా సైబర్ బారిన పడితే టోల్ ఫ్రీ నెంబర్ 1930 లో ఫిర్యాదు చేయండి.


  "ఇట్లు" 


అబ్దుల్ రెహమాన్.

కొత్తగూడెం డిఎస్పి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా