ఘనంగా సాయిరాగ సంగీత కళాశాల వార్షికోత్సవం

బెంజ్ న్యూస్ . అలరించిన అన్నమయ్య కీర్తనలు ది.01.02.2025 సాయంత్రం స్థానిక అన్నమయ్య కళావేదిక, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, బృందావన్ గార్డెన్స్ నందు శ్రీ సాయి రాగ‌ సంగీత కళాశాల, గుంటూరు వారు తమ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.‌ కార్యక్రమాన్ని తొలుత రావినూతల వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఉప కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ, డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, జాతీయ ఉపాధ్యక్షులు, అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ ) మరియు చైర్మన్ అమరావతి అభివృద్ధి కమిటీ, కందిమళ్ళ శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా డివిజనల్ పంచాయతీ అధికారి
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ, సిహెచ్. మస్తానయ్య, అధ్యక్షులు, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, బృందావన్ గార్డెన్స్, గుంటూరు మరియు ప్రముఖ బిల్డర్, శ్యామ్ కన్స్ట్రక్షన్స్ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ మునిపల్లె రమణి తన శిష్యులతో అన్నమయ్య కీర్తనలు ఆలపించి‌ ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నారు.‌ అనంతరం అతిథులు పిల్లలకు జ్ఞాపికలు మరియు ప్రశంసా పత్రాలు సమర్పించారు. ప్రముఖ రంగస్థల నటుడు, నందీ అవార్డ్ గ్రహీత బసవరాజు జయ శంకర్ ని కళాశాల ప్రిన్సిపాల్ మునిపల్లె రమణి ఆధ్వర్యములో అతిథులు ఘనంగా సన్మానించారు. కళాశాలలో సంగీతం నేర్చుకునే పిల్లలు అందరూ తమ గురువును ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమం మొత్తం మునిపల్లె రమణి అధ్యక్షతన నిర్వహించారు.