30-01-2025 సచివాలయం, అమరావతి
January 30, 2025
*గౌరవ ముఖ్య మంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ను కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు మరియు
అఖిల భారత పంచాయతీ పరిషత్ (దిల్లీ )జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు
ఈ సందర్భంగా వారు రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్లు పలు సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు.
వాటిలో ముఖ్యంగా గత మూడు సంవత్సరాలుగా 5వ ఆర్ధిక సంఘం ద్వారా గ్రామపంచాయతీకి రావాల్సిన నిధులను, గ్రామపంచాయతీలకు రావాల్సిన వాటాను బదిలీ చేయాలని,
సర్పంచుల గౌరవ వేతనమును 3000 రూపాయల నుండి 15000 రూపాయలకు పెంచాలని,
సర్పంచులు విధి నిర్వహణలో మరణిస్తే 20 లక్షల వరకు ప్రమాద బీమా సదుపాయం కల్పించాలని,
గిరిజన తండాలను ప్రత్యేకంగా పరిగణించి ప్రత్యేక నిధులు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
73, 74 రాజ్యాంగ
సవరణ ప్రకారం గ్రామపంచాయతీలకు సంక్రమించిన 29 అంశాలను రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా బదిలీ చేయాలని,
MGNREGS నిధులను గ్రామపంచాయతీ సర్పంచుల ఆధ్వర్యంలోనే జమ చేయాలని, గతంలో సర్పంచుల ఆధ్వర్యంలోనే పేమెంట్స్ జరిగాయని కానీ ఇప్పుడు MPDO కార్యాలయాల్లో VENDOR CODE క్రియేట్ చేసి పేమెంట్స్ చేస్తున్నారని అలాకాకుండా ఈ పేమెంట్స్ అన్నీ గ్రామ సర్పంచ్ల ఆధ్వర్యంలోనే జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సర్పంచుల కుటుంబ సభ్యులకు తిరుమల శ్రీవారి విఐపి దర్శనం సంవత్సరానికి ఒకసారి కల్పించాలని,
గ్రామ పంచాయతీలకు రావలసిన రిజిస్ట్రేషన్ సర్ -ఛార్జ్ సీనరీలను లను క్రమం తప్పకుండా పంచాయతీ శాఖలలో జమ అయ్యేవిధంగా IG రిజిస్ట్రేషన్ గారికి ఆదేశాల జారీ చేయాలని,
ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం అందచేశారు.
ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వీరి విజ్ఞప్తులను పరిశీలిస్తానని చెప్పారు