బెంజ్ న్యూస్.ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అన్నం పల్లె గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ సిరిగిరి రవి గుండెపోటుతో మంగళవారం
మృతి చెందారు.
ఒంగోలులో విధి నిర్వహణలో ఉండగా సిరిగిరి రవి గుండెపోటుకు గురయ్యాడు. రవిని ఒంగోలులో స్థానిక ఓ ఆసుపత్రికి తరలించారు.
కానీ అప్పటికే రవి మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. రవి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం అన్నం పల్లె గ్రామానికి బుధవారం తరలించనున్నారు.
రవి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి ...